తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీ

హైదరాబాద్, చౌరాస్తా :రాష్ట్రంలో పలువురు ఏడుగురు సీనియర్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో ఆరుగురు ఐఏఎస్ (IAS) అధికారులు , ఒకరు ఐపీఎస్( IPS ) అధికారి ఉన్నారు.

 

బదిలీ అయిన అధికారులు వీరే..

 

  • రంగారెడ్డి కలెక్టర్‌గా గౌతం పొత్రు
  • రవాణా శాఖ కమిషనర్‌గా జ్యోతి బుద్ధప్రకాష్‌
  • ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ కమిషనర్‌గా ఈ శ్రీధర్‌
  • ఇంటర్మీడియట్‌ బోర్డు డైరెక్టర్‌గా శృతి ఓఝా
  • గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఈవీ నరసింహారెడ్డి
  • పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా దేవేంద్రసింగ్ చౌహాన్‌
  • భారతి హొలికేరికి ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ జారీ చేయలేదు.

You may also like...