విద్యార్థి మృతికి సంతాపం

స్టేషన్ ఘన్ పూర్, చౌరాస్తా : జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న కన్నబోయిన సందీప్ అనే విద్యార్థి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా బుధవారం కళాశాల యాజమాన్యం, విద్యార్థులు సంతాపాన్ని ప్రకటించారు. ప్రిన్సిపల్ ఎం.రాజిరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది, విద్యార్థులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి శ్రద్ధాంజలి ఘటించారు. పోతుడి కుటుంబానికి సంతాపానికి సానుభూతిని ప్రకటించారు.

You may also like...