బీజేపీ లోక్​సభ అభ్యర్థుల జాబితా విడుదల

  • మొదటి లిస్ట్‌ తెలంగాణ 9 స్థానాలు ఖరారు
  • మరో 8 స్థానాలు పెండింగ్‌లో…
  • భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ పోటీ

జనగామ, (చౌరాస్తా ప్రతినిధి) : భారతీయ జనతా పార్టీ లోక్​సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో  దేశ వ్యాప్తంగా 195  స్థానాలకు పోటీలో ఉండే అభ్యుర్థల పేర్లను ప్రకటించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి 9 స్థానాలు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 17 స్థానాలు ఉండగా 8 స్థానాలు హైకమాండ్‌ పెండింగ్‌లో పెట్టింది. అందులో ఉమ్మడి వరంగల్‌ నుంచే వరంగల్‌, మహబూబాబాద్​ రెండు స్థానాలు ఉన్నాయి.

ప్రకటించిన పేర్లు ఇవే…

  • కరీంనగర్‌‌ – బండి సంజయ్​
  • నిజామాబాద్​ – ధర్మపురి అర్వింద్​
  • జహీరాబాద్– బీబీ పాటిల్
  • మల్కాజ్‌గిరి– ఈటల రాజేందర్​
  • సికింద్రాబాద్​–జి.కిషన్‌రెడ్డి
  • హైదరాబాద్​–డాక్టర్ మాధవి లత
  • చేవెళ్ల– కొండ విశ్వేశ్వర్​రెడ్డి
  • నాగర్‌‌కర్నూల్‌–పి.భరత్​
  • భువనగిరి– బూర నర్సయ్యగౌడ్​

You may also like...