A fond farewell to Janagama CI : జనగామ సీఐకి ఆత్మీయ వీడ్కోలు

A fond farewell to Janagama CI : జనగామ సీఐకి ఆత్మీయ వీడ్కోలు
  • రఘునాథపల్లికి బదిలీ అయిన శ్రీనివాస్‌ యాదవ్​
  • గజమాలతో సత్కరించిన సిబ్బంది

A fond farewell to Janagama CI : జనగామ సీఐకి ఆత్మీయ వీడ్కోలు

జనగామ, (చౌరాస్తా న్యూస్​) : రఘునాథపల్లి సీఐగా బదిలీపై వెళ్తున్న జనగామ సీఐ ఎలబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ ఆత్మీయ వీడ్కోలు లభించింది. ఇంతకాలం ఆయనతో కలిసి పనిచేసిన ఎస్సైలు సృజన్‌కుమార్, అరుణ్‌కుమార్, తిరుపతి, స్వేత తదితర పోలీసు సిబ్బంది సీఐని గజమాలతో సత్కరించారు. టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్షుడు ఇర్రి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి సురిగల భిక్షపతితో పాటు పలువురు జర్నలిస్టులు, జనగామ పుర ప్రముఖులు సీఐని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్‌ మాట్లాడుతూ తాను 2022 ఏప్రిల్‌11న జనగామ ఎస్‌హెచ్‌వోగా విధుల్లో చేరానని పేర్కొన్నారు. నాటి నుంచి నేటి వరకు తనను ప్రోత్సహించిన ఉన్నతాధికారులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే విధుల్లో తోడుగా నిలిచిన అధికారులు, ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది సహకారాన్ని తాను ఎప్పటికీ మరువలేనని పేర్కొన్నారు. గడిచిన సుమారు రెండేళ్ల కాలంలో ఎన్నికలు, దశాబ్ది ఉత్సవాలు, ఎన్నో సభలు, ప్రోటోకాల్ డ్యూటీల్లో సిబ్బంది సమష్టిగా పనిచేసి సక్సెస్‌ చేశామని తెలిపారు. జిల్లా కేంద్రంలో అన్ని శాఖల అధికారులు ఎంతో సహకరించారని, శాంతి భద్రతల పరిరక్షణలో సహకరించిన పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు మీడియా మిత్రులు అన్నివర్గాల ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

A fond farewell to Janagama CI : జనగామ సీఐకి ఆత్మీయ వీడ్కోలు

వ్యవసాయమే నా లక్ష్యం..

అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్‌ జర్నలిస్ట్)

పొమ్మనలేక పొగ పెడుతున్నరు..

ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్‌

ఉద్యోగం మానేకే అప్పు ముట్ట జెప్పిన

You may also like...