ఉన్నత శిఖరాలకు ఎదగాలి

స్టేషన్ ఘన్ పూర్, చౌరాస్తా : సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని శ్రద్దగా చదివి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి హనుమకొండ రోటరీ క్లబ్ బాధ్యులు రాపోలు శేషారెడ్డి అన్నారు. బుదవారం మండలంలోని తాటికొండ ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన 22 మంది విద్యార్థినులకు రోటరీ క్లబ్ సహకారంతో అందించిన సైకిళ్లు పంపిణి చేశారు.

 

అనంతరం పాఠశాల ప్రధానోపాద్యాయులు కౌడ రాజేందర్ అధ్యక్షన ఏర్పాటు చేసిన సమావేశంలో శేషారెడ్డి మాట్లాడుతూ గ్రామాల నుండి సరైన రవాణా సౌకర్యం లేక విద్యార్థులు కొందరు చదువుకోలేక పోవుచున్నారని గమనించిన రోటరీ క్లబ్ బాధ్యులు బాలికల సౌకర్యార్థం 22 సైకిళ్ళను పంపిణీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటుగా వ్యాయామం, ఆటపాటల్లో రాణించాలని సూచించారు. సైకిళ్ళను బహుకరించిన రోటరీ క్లబ్ మరియు తాటికొండ గ్రామ వాస్తవ్యులు రాపోలు శేషారెడ్డికి పాఠశాల ఉపాధ్యాయ బృందం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు  పాల్గొన్నారు.

You may also like...